

హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు మూసీ నది పునరుజ్జీవనానికి ఊతమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి ఘన్పూర్ వరకు రెండు భారీ పైప్లైన్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో పైప్లైన్ సుమారు 10 టీఎంసీల నీటిని తరలించే సామర్థ్యంతో నిర్మించనున్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ నుంచి మొత్తం 20 టీఎంసీల నీటిని హైదరాబాద్కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గోదావరి తాగునీటి ప్రాజెక్టు 2, 3 దశల ద్వారా ఈ నీటిని తరలించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ జలమండలి గతంలో టెండర్లను ఆహ్వానించింది. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రూ.5,383.67 కోట్ల అంచనా వ్యయంతో పనులను రెండు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. మొదటి ప్యాకేజీలో మల్లన్నసాగర్ నుంచి ఘన్పూర్ వరకు, రెండో ప్యాకేజీలో ఘన్పూర్ నుంచి ఉస్మాన్సాగర్ వరకు పైప్లైన్లు ఏర్పాటు చేస్తారు. పైప్లైన్ నిర్మాణంతో పాటు పంపింగ్, టెస్టింగ్, కమిషనింగ్ పనులు కూడా ఇందులో భాగంగా ఉంటాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!