

వచ్చే రెండు నెలల్లో టీవీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్ల ధరలు 4 నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. మెమరీ చిప్స్ ధరలు భారీగా పెరగడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇప్పటికే చిప్స్ రేట్లు సుమారు 50 శాతం వరకు పెరిగాయని, రాబోయే రెండు నెలల్లో మరో 40 నుంచి 50 శాతం, ఆ తర్వాత మూడు నెలల్లో మరో 20 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
దీంతో ఎలక్ట్రానిక్ డివైసుల తయారీ ఖర్చు పెరిగి, ఆ ప్రభావం వినియోగదారులపై పడనుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గత మూడు నెలల్లోనే స్మార్ట్ఫోన్ ధరలు 3 నుంచి 21 శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది మొత్తం మీద ధరలు 30 శాతం కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నథింగ్ కంపెనీ సీఈవో అంచనా వేశారు. ధరలు మరింత పెరగకముందే కొనుగోలు చేయాలని భావించే వినియోగదారులు ఇప్పటి నుంచే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!