

జియో ప్లాట్ఫామ్స్, ఆంథ్రోపిక్, ఎరిక్సన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ క్లౌడ్ వంటి అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు కలిసి విశ్వసనీయ సాంకేతిక కూటమి (Trusted Tech Alliance - TTA)ను ఏర్పాటు చేశాయి. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆఫ్రికా, ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాలకు చెందిన 15 ప్రముఖ కంపెనీలు ఈ కూటమిలో భాగమయ్యాయి. క్లౌడ్ మౌలిక సదుపాయాలు, అనుసంధానత, సెమీ కండక్టర్లు, సాఫ్ట్వేర్, ఏఐ వంటి రంగాల్లో విశ్వసనీయ సాంకేతికతను అభివృద్ధి చేయడం ఈ కూటమి లక్ష్యంగా ఉంది.
ఈ కూటమి పారదర్శకత, భద్రత, డేటా రక్షణ వంటి ఉమ్మడి సూత్రాల ఆధారంగా పనిచేయనుంది. సరఫరాదారు జాతీయతతో సంబంధం లేకుండా నమ్మకమైన సాంకేతిక సేవలను అందించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చాలని కంపెనీలు భావిస్తున్నాయి. అలాగే ప్రభుత్వాలు, వినియోగదారులతో కలిసి పనిచేస్తూ ఉద్యోగాల సృష్టి, ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ప్రస్తుతం ఈ కూటమిలో ఆంథ్రోపిక్, ఏడబ్ల్యూఎస్, కోహియర్, ఎరిక్సన్, గూగుల్ క్లౌడ్, జియో ప్లాట్ఫామ్స్, మైక్రోసాఫ్ట్, నోకియా, ఎన్టీటీ, ఎస్ఏపీ తదితర సంస్థలు భాగస్వామ్యంగా ఉన్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!