

దలాల్ స్ట్రీట్లో బుధవారం ప్రైమరీ మార్కెట్ సందడి నెలకొంది. ఒకేసారి ఆరు మెయిన్బోర్డు ఐపీఓలు సబ్స్క్రిప్షన్కు తెరుచుకున్నాయి. సెప్టెంబర్ 9న ప్రారంభమైన ఈ పబ్లిక్ ఇష్యూలు సెప్టెంబర్ 11న ముగియనున్నాయి. రెంట్మోజో, మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్, కరమ్తారా ఇంజినీరింగ్, ఆర్సిల్, ఎల్సీసీ ప్రాజెక్ట్స్, స్టీమ్హౌస్ ఇండియా ఐపీఓలు ఇందులో ఉన్నాయి. రెంట్మోజో రూ.1,256 కోట్లు సమీకరించనుండగా.. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.384–404గా నిర్ణయించింది. మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్ రూ.805 కోట్ల సమీకరణ లక్ష్యంతో రూ.322–339 ధరల శ్రేణిని నిర్ణయించింది.
కరమ్తారా ఇంజినీరింగ్ రూ.875 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణి రూ.241–254గా ఉంది. ఆర్సిల్ రూ.733 కోట్ల సమీకరణకు రూ.132–139 ధరల శ్రేణితో ఐపీఓకు వచ్చింది. ఎల్సీసీ ప్రాజెక్ట్స్ రూ.427 కోట్ల సమీకరణ లక్ష్యంతో రూ.139–146 ధరల శ్రేణిని నిర్ణయించింది. స్టీమ్హౌస్ ఇండియా రూ.414 కోట్లను సమీకరించనుండగా.. ధరల శ్రేణి రూ.77–81గా, లాట్ సైజ్ 185 షేర్లుగా ఉంది. ఆయా ఐపీఓల్లో రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయింపులు, కనీస పెట్టుబడి మొత్తాలు భిన్నంగా ఉన్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!