

మార్కెట్లు మళ్లీ భారీ పతనాన్ని చవిచూశాయి. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ ఎగసిపడటం వంటి ప్రతికూల సంకేతాల మధ్య దలాల్ స్ట్రీట్లో మరోసారి రక్తపాతం కనిపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,690 పాయింట్లు క్షీణించి 73,583 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 486 పాయింట్లు పడిపోయి 22,819 వద్ద స్థిరపడింది. దాదాపు అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి.
అయితే పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించిన నేపథ్యంలో ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజం ONGC షేర్కు భారీగా మద్దతు లభించింది. ఇంధన ధరల భారం తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మార్కెట్లో ONGCకు ఊతమిచ్చింది. ఇదే సమయంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర మళ్లీ బ్యారెల్కు 110 డాలర్ల మార్క్ను దాటడంతో మార్కెట్లలో ఆందోళన మరింత పెరిగింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెంచే అవకాశముందనే భయాలు పెట్టుబడిదారుల్లో కనిపించాయి.



















.jpg.webp&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!