

రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తోందన్న కారణంతో భారత్పై అమెరికా అదనపు పన్నులు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టారిఫ్ల నుంచి భారత్కు త్వరలోనే కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సంకేతాలు ఇచ్చారు. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను క్రమంగా తగ్గించుకుంటుండటమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన తెలిపారు.
గతంలో రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసిన నేపథ్యంలో భారత్పై అదనంగా 25 శాతం టారిఫ్ విధించడంతో, భారత వస్తువులపై అమెరికాలో మొత్తం 50 శాతం వరకు పన్నులు అమలవుతున్నాయి. అయితే ఇప్పుడు చమురు కొనుగోళ్లు తగ్గడంతో ఆ అదనపు 25 శాతం టారిఫ్ను త్వరలోనే తగ్గించే అవకాశం ఉందని స్కాట్ బెసెంట్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించిన విషయం తెలిసిందే. 2025 ఆగస్టులో భారత దిగుమతులపై టారిఫ్లను రెట్టింపు చేసి 50 శాతానికి పెంచినప్పటికీ, తాజా పరిణామాలు భారత్కు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!