

ఫార్మాస్యూటికల్ కంపెనీలకు సంబంధించిన ‘కొన్ని చిన్న స్థాయి ఉల్లంఘనల’ విషయంలో ఇకపై కోర్టులకు హాజరు కావాల్సిన అవసరం ఉండదని, తాజాగా సవరించిన మార్గదర్శకాలను ఉటంకిస్తూ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి సందర్భాల్లో కంపెనీలు నిర్దిష్ట షరతులకు లోబడి నగదు జరిమానా చెల్లించి, అవసరమైన స్వీయ దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం కల్పించారు.
1940 డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ చట్టంతో పాటు ఇతర చట్టాల్లోని చిన్న నేరాలను డీక్రిమినలైజ్ చేస్తూ, వ్యాపార నిర్వహణను సులభతరం చేయాలనే లక్ష్యంతో జన్ విశ్వాస్ చట్టం కింద డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ (కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్) 2025 ను ప్రవేశపెట్టారు. ఈ చట్టం ద్వారా మార్గదర్శకాల్లో కీలక మార్పులు చేపట్టారు. ఈ చట్టం దేశంలో మందులు, కాస్మటిక్స్, వైద్య పరికరాల భద్రత, సామర్థ్యం, నాణ్యతను నిర్ధారించే విధంగా అమలులో ఉంది. నిబంధనలను పాటించకపోతే విచారణ జరగవచ్చు.
అయితే న్యాయ వ్యవస్థపై భారం తగ్గించే ఉద్దేశంతో చిన్న, సాంకేతిక ఉల్లంఘనలను సులభంగా పరిష్కరించేందుకు సెక్షన్ 32బీని ప్రవేశపెట్టారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ‘నేరాల సమ్మేళనం’ అనే కొత్త విధానాన్ని వివరిస్తూ డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ (నేరాల సమ్మేళనం) నిబంధనలు 2025 ను రూపొందించింది. అయితే ఇందులో విధించే జరిమానా మొత్తాలు లేదా ఏయే నేరాలకు ఇది వర్తిస్తుందో ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!