

రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన సాంకేతిక విభాగం జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ ఆవిష్కరణల రంగంలో మరో కీలక మైలురాయిని సాధించింది. ప్రపంచ మేధోసంపత్తి సంస్థ విడుదల చేసిన 2025 పేటెంట్ సహకార ఒప్పంద ర్యాంకింగ్స్లో, జియో ప్లాట్ఫామ్స్ ఏకంగా 320 స్థానాలు ఎగబాకి 20వ స్థానాన్ని దక్కించుకుంది.
ఈ ఘనతతో జియో ప్లాట్ఫామ్స్ ప్రపంచ ప్రముఖ సాంకేతిక సంస్థలైన హువే, సామ్సంగ్, క్వాల్కామ్, ఎల్జీ, పానసోనిక్, నోకియా, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ సంస్థల సరసన నిలిచింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆవిష్కర్తలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ టాప్-20 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సాంకేతిక ఆవిష్కర్తగా జియో ప్లాట్ఫామ్స్ నిలిచింది. 2026 మార్చి 31 నాటికి సంస్థ మొత్తం 6,817 పేటెంట్లను దాఖలు చేయడం విశేషం. ఇది ప్రపంచ సాంకేతిక రంగంలో సంస్థ పెరుగుతున్న ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!