
జనరల్

దాదాపు 4 బిలియన్ డాలర్ల ఐపీఓకు సిద్ధమవుతున్న జియో ప్లాట్ఫామ్స్ క్యూ1లో ఆకట్టుకునే ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ నికర లాభం 9.2 శాతం పెరిగి రూ.7,764 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ.7,110 కోట్లుగా ఉంది. ఆదాయం 11.8 శాతం పెరిగి రూ.39,173 కోట్లకు చేరగా, ఎబిటా 15.1 శాతం వృద్ధితో రికార్డు స్థాయిలో రూ.20,865 కోట్లను తాకింది.
ఒక్కో యూజర్ నుంచి సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 3.3 శాతం పెరిగి రూ.215.6కి చేరింది. ఒక్కో యూజర్ నెలవారీ డేటా వినియోగం 43.7 జీబీకి పెరిగి 26.9 శాతం వృద్ధి సాధించింది. జూన్ నాటికి మొత్తం వినియోగదారుల సంఖ్య 7.1 శాతం పెరిగి 53.3 కోట్లకు చేరగా, గతేడాది ఇదే కాలంలో ఇది 49.8 కోట్లుగా ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!