
జనరల్

ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికం (క్యూ1)లో రూ.1,465 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 28.4 శాతం పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 17.7 శాతం పెరిగి దాదాపు రూ.15,712 కోట్లకు చేరుకుంది. డాలర్ పరంగా కంపెనీ ఆదాయం 1.66 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
కంపెనీ సీఈఓ, ఎండీ మోహిత్ జోషి మాట్లాడుతూ పరిశ్రమలోనే అత్యుత్తమ వృద్ధిని నమోదు చేశామని తెలిపారు. ప్రతిభావంతుల నియామకం, కొత్త క్లయింట్లను సంపాదించడం, పెద్ద ఒప్పందాలను దక్కించుకోవడం వృద్ధికి దోహదపడిందన్నారు. ఆదాయాలపై స్పష్టత పెరగడంతో త్వరలోనే క్యాంపస్ నియామకాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశముందని, 50 మిలియన్ డాలర్లకు పైగా వ్యాపారం అందించే క్లయింట్ల సంఖ్య కూడా పెరిగిందని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!