

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మంగళవారం అమెరికాకు చెందిన కృత్రిమ మేధ సంస్థ ఆంథ్రోపిక్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా టెలికాం, ఆర్థిక సేవలు, తయారీ, సాఫ్ట్వేర్ అభివృద్ధి రంగ సంస్థలకు ఆధునిక ఏఐ పరిష్కారాలను అందించనుంది. తొలి దశలో టెలికమ్యూనికేషన్స్ రంగ అవసరాలకు అనుగుణంగా ఏఐ ఏజెంట్ల అభివృద్ధి మరియు అమలు కోసం ఆంథ్రోపిక్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ను ప్రారంభించి, అనంతరం ఇతర రంగాలకు విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా ఇన్ఫోసిస్ తన టోపాజ్ ఏఐ ఆఫరింగ్స్ను ఆంథ్రోపిక్కు చెందిన క్లాడ్ మోడళ్లతో అనుసంధానించనుంది. సంస్థలు తమ సంక్లిష్ట కార్యకలాపాలను యాంత్రీకరించడంతో పాటు వేగవంతమైన సాఫ్ట్వేర్ డెలివరీ, నిబంధనలకు అనుగుణమైన బాధ్యతాయుత ఏఐ వినియోగానికి ఇది దోహదపడనుంది. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ, ఏఐ వ్యాపార పరివర్తనకు తోడ్పడటమే కాక పరిశ్రమల నిర్వహణ మరియు ఆవిష్కరణలను పునర్నిర్వచిస్తోందని, ఈ భాగస్వామ్యం ఎంటర్ప్రైస్ ఏఐ పురోగతికి కీలక ముందడుగని పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!