

హైదరాబాద్కు చెందిన లోతైన సాంకేతిక రంగ సంస్థ బ్లూజే ఏరోస్పేస్ కొత్త తరహా సరుకు రవాణా విమానాన్ని ఆవిష్కరించింది. ‘జెన్ 2’ పేరుతో రూపొందించిన ఈ నమూనా విమానం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల దూరం వరకు వస్తువులను తరలించడానికి ఉపయోగపడుతుందని సంస్థ వెల్లడించింది.
విద్యుత్ శక్తితో పనిచేసే ఈ విమానం 200 కిలోల బరువైన సరుకుతో నిలువుగా ఎగిరి, అదే విధంగా భూమిపై దిగగలదని కంపెనీ తెలిపింది. సంస్థ అభివృద్ధి చేసిన వాంటిస్ వేదికపై రూపొందించిన తొలి విమానం ఇదేనని పేర్కొంది. ఈ విమాన అభివృద్ధికి నాలుగేళ్లపాటు పరిశోధనలు, పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.
2027 నాటికి ఈ విమానాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు బ్లూజే ఏరోస్పేస్ తెలిపింది. ఇప్పటికే 500 కిలోల సామర్థ్యంతో మరో విమానాన్ని అభివృద్ధి చేసిన సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు రక్షణ రంగ సంస్థల్లో పైలట్ ప్రాతిపదికన విజయవంతంగా వినియోగించినట్లు వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!