

ఛత్తీస్గఢ్ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించే దిశగా మరో కీలక అడుగు వేసింది. హైదరాబాద్లో నిర్వహించిన ‘ఇన్వెస్టర్ కనెక్ట్’ కార్యక్రమంలో డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, సౌర శక్తి పరికరాలు, వస్త్ర పరిశ్రమ, ఔషధ రంగం వంటి కీలక రంగాల్లో మొత్తం రూ.9,580 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు అందాయి. ఏడు ప్రముఖ సంస్థలు ఈ ప్రతిపాదనలు సమర్పించగా, వీటి ద్వారా సుమారు 7,800 ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి పెట్టుబడిదారులకు అధికారిక ఆహ్వాన పత్రాలను అందజేశారు.
అత్యధికంగా హైపర్నెక్స్ట్ డేటా సెంటర్ లిమిటెడ్ రూ.4,200 కోట్ల పెట్టుబడిని ప్రకటించగా, ఫీగ్రేడ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సిమెంట్ రంగంలో రూ.2,912 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించింది. సెమీకండక్టర్, జీపీయూ మౌలిక సదుపాయాల కోసం నివాయ్ ల్యాబ్స్ రూ.1,000 కోట్లు, సౌర పరికరాల తయారీకి ఎస్జీ మార్ట్ రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపాయి. ఛత్తీస్గఢ్లో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూల వాతావరణం, సింగిల్ విండో అనుమతులు, మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్న సీఎం సాయి, హైదరాబాద్కు చెందిన ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ సంస్థలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!