
సినిమాలు

మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కర్ణాటకలో నిర్మిస్తున్న కైగా అణు విద్యుత్ కేంద్రానికి అవసరమైన పరికరాల సరఫరా కోసం ఎంటార్ టెక్నాలజీస్కు రూ.310 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్ ప్రకారం కైగా 5,6 సివిల్ అణు రియాక్టర్లకు సంబంధించిన వివిధ పరికరాలను 2030 ఫిబ్రవరి నాటికి దశల వారీగా సరఫరా చేయనుంది.
ఇంతకు ముందే ఈ రియాక్టర్ల కోసం ఎంటార్ టెక్నాలజీస్కు రూ.194 కోట్ల ఆర్డర్ లభించిందని, తాజా ఆర్డర్తో కలిపి మొత్తం ఆర్డర్ విలువ రూ.504 కోట్లకు చేరిందని సంస్థ ఎండీ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఎంటార్ టెక్నాలజీస్కు హైదరాబాద్లోని ఎగుమతి ఆధారిత యూనిట్తో పాటు మొత్తం తొమ్మిది తయారీ యూనిట్లు ఉన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!