

ముడి పదార్థాల ధరలు పెరగడం మరియు కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు అమల్లోకి రావడం వల్ల ఎయిర్ కండీషనర్ల (ఏసీ) ధరలు పెరగనున్నాయని బ్లూస్టార్ గ్రూప్ ప్రెసిడెంట్ మోహిత్ సూద్ తెలిపారు. రాగి, అల్యూమినియం, ప్లాస్టిక్ వంటి పదార్థాల ధరలు పెరగడంతో తయారీ ఖర్చు సుమారు 8 శాతం పెరిగిందని చెప్పారు.
ఇంధన సామర్థ్యాన్ని పెంచే కొత్త స్టార్ రేటింగ్ నియమాల కారణంగా అదనంగా 4 శాతం ఖర్చు పెరిగి, మొత్తం ఖర్చు 12 శాతం పెరిగిందని వివరించారు. అయితే జీఎస్టీ ప్రయోజనం ఉండడంతో వినియోగదారులపై ధరల భారం సుమారు 7 నుంచి 8 శాతం వరకు మాత్రమే ఉండవచ్చని తెలిపారు.
హైదరాబాద్లో కొత్త ఏసీ మోడళ్లను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఏసీ రంగం 20-25 శాతం వృద్ధి సాధించగా, ఈ సంవత్సరం కొంత మందగింపు ఉండి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. అయితే 2026-27లో మళ్లీ 15 శాతం వృద్ధి నమోదు కావచ్చని అంచనా వేశారు.
ఏసీ తయారీలో ఉపయోగించే ఎల్ఎన్జీ సరఫరా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో ఉన్న ప్లాంట్ సామర్థ్యాన్ని సంవత్సరానికి 14 లక్షల యూనిట్లకు పెంచినట్లు, అవసరమైతే 18 లక్షల యూనిట్ల వరకు పెంచగలమని చెప్పారు.
ప్రస్తుతం ఏసీల తయారీలో ఉపయోగించే విడిభాగాల్లో 65 శాతం వరకు స్వదేశీ ఉత్పత్తులేనని తెలిపారు. అదనంగా, మిడ్నైట్ సిల్వర్ ఫినిష్తో ఐకానియా ప్రీమియం ఏసీని రూ.51,000 ధరకు విడుదల చేసినట్లు వెల్లడించారు.

















.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!