

భారతీయ లిక్కర్ పరిశ్రమ ఇప్పుడు బ్రాండీకి సరికొత్త గుర్తింపు తీసుకురావాలని భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు జలుబు మందు, లోకల్ డ్రింక్ అనే ఇమేజ్తో ఉన్న బ్రాండీని ప్రీమియం, స్టైలిష్ ఆల్కహాలిక్ బ్రాండ్గా మార్చేందుకు కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రత్యేక ప్యాకేజింగ్, స్మూత్ బ్లెండ్స్, కాక్టెయిల్ కల్చర్, యువతను ఆకట్టుకునే బ్రాండింగ్ వంటి వ్యూహాలతో బ్రాండీకి కొత్త మేకోవర్ ఇవ్వాలని చూస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్న భావోద్వేగ అనుబంధం బ్రాండీ భవిష్యత్తుకు పెద్ద బలంగా మారుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలోని మొత్తం బ్రాండీ అమ్మకాలలో దాదాపు 98 శాతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. ఇందులో తమిళనాడు ఒక్కటే సగానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 88.5 మిలియన్ కేసుల బ్రాండీ అమ్ముడవుతుండగా, 750ml లెక్కలో ఇది 100 కోట్లకు పైగా బాటిళ్లుగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. జిన్, టేకీలా వంటి ప్రీమియం డ్రింక్స్కు పెరుగుతున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని బ్రాండీని కూడా దేశవ్యాప్తంగా స్టైలిష్ మరియు ప్రీమియం బ్రాండ్గా మార్చాలని కంపెనీలు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!