

భారత్–యునైటెడ్ కింగ్డమ్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) వచ్చే నెల 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి 15 ఏళ్లలో యూకే నుంచి 3.78 లక్షల ప్యాసింజర్ కార్ల దిగుమతికి భారత్ అనుమతించనుంది. వాహనాలపై దిగుమతి సుంకం సుమారు 110 శాతం నుంచి 10 శాతానికి తగ్గనుంది.
ఈ ఒప్పందంలో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కీలక అంశాలు ఉన్నాయి. యూకే నుంచి ప్రతి సంవత్సరం 20,000 నుంచి 37,000 కార్ల దిగుమతికి అవకాశం ఉండగా, భారత్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్, హైడ్రోజన్ కార్లను యూకేకు ఎగుమతి చేయనుంది. ఆరవ సంవత్సరం నుంచి సుంకం లేకుండా ఎగుమతులు చేయవచ్చు. 15వ సంవత్సరం నాటికి ఎగుమతుల పరిమితి 88,000 యూనిట్లకు చేరనుంది.
అలాగే సామాజిక భద్రత ఒప్పందం వల్ల యూకేలో పనిచేస్తున్న 90–95 శాతం మంది భారతీయ నిపుణులకు లబ్ధి చేకూరనుంది. ఐదేళ్ల వరకు సోషల్ సెక్యూరిటీ చెల్లింపుల నుంచి మినహాయింపు లభించనుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ సంస్థలకు ఇది వ్యయ తగ్గింపుతో పాటు పోటీ సామర్థ్యాన్ని పెంచనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!