

న్యూఢిల్లీ: ప్రముఖ AI సంస్థ ఓపెన్ఏఐ భారత వినియోగదారులకు పెద్ద గుడ్న్యూస్ ఇచ్చింది. నవంబర్ 4 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక ప్రచార కాలంలో సైన్అప్ చేసుకునే వినియోగదారులందరికీ, వారి ‘చాట్జీపీటీ గో’ సర్వీస్ను పూర్తి ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్, బెంగళూరులో జరగనున్న ఓపెన్ఏఐ డెవ్డే ఎక్స్చేంజ్ ఈవెంట్ సందర్భంగా ప్రకటించబడింది. ఇది భారతదేశంలో వేగంగా పెరుగుతున్న AI వినియోగాన్ని, ఇండియాAI మిషన్ లక్ష్యాలను బలోపేతం చేస్తుందని సంస్థ తెలిపింది.
భారతదేశంలో కొన్ని నెలల క్రితం ప్రారంభమైన చాట్జీపీటీ గో, అధిక మెసేజ్ లిమిట్స్, ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్లోడ్ ఫీచర్లతో తక్కువ ధరలో ప్రీమియం అనుభవం ఇవ్వడం లక్ష్యంగా రూపొందించబడింది. ప్రారంభించిన ఒక నెలలోనే, భారతదేశంలో చాట్జీపీటీ పేడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య రెట్టింపైంది. పెరిగిన డిమాండ్ నేపథ్యంలో, ఈ సర్వీస్ను 90కి పైగా దేశాలకు విస్తరించినట్లు ఓపెన్ఏఐ వెల్లడించింది. భారతదేశం ప్రస్తుతం చాట్జీపీటీకి రెండవ అతిపెద్ద మార్కెట్, అలాగే వేగంగా ఎదుగుతున్న దేశాల్లో ఒకటిగా ఉంది. నిక్ టర్లీ, చాట్జీపీటీ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ – “భారత వినియోగదారుల సృజనాత్మకత, స్పందన మాకు ప్రేరణ కలిగించింది. డెవ్డే ఎక్స్చేంజ్ సందర్భంగా, మరింత మందికి AI అనుభవం చేరాలనే ఉద్దేశంతో, చాట్జీపీటీ గోను ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నాము” అన్నారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!