

సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందినా మానవీయ విలువలను విస్మరిస్తే సమాజ సమతుల్యత దెబ్బతింటుందని వాటికన్ వేదికగా ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. మే 25న వాటికన్ ఆడిటోరియంలో పోప్ లియో ‘మాగ్నిఫికా హ్యుమానిటాస్’ అనే ఎన్సైక్లికల్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు క్రిస్టోఫ్ ఓలా పాల్గొని ఏఐ వల్ల భవిష్యత్తులో ఉద్యోగ నష్టాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
కంప్యూటర్ కోడింగ్, కంటెంట్ రైటింగ్, డేటా అనలిటిక్స్ వంటి పనులను ఏఐ వేగంగా భర్తీ చేస్తోందని ఆయన తెలిపారు. ఏఐ విస్తరణతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, వారికి సామాజిక–ఆర్థిక మద్దతు ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పోప్ విడుదల చేసిన ఈ పత్రం కూడా ఏఐ యుగంలో మానవ హక్కులు, నైతిక విలువల రక్షణపై దృష్టి సారించింది. అదుపు లేని సాంకేతిక అభివృద్ధి సమాజానికి ప్రమాదకరమని పోప్ హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!