

భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 17 నుంచి 23 వరకు ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ జరగనుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఇండియా ఓపెన్లో పావురాలు మైదానంలోకి రావడంతో రెండు మ్యాచ్లకు అంతరాయం ఏర్పడింది. ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్టేడియంలోని వెంట్లను మూసివేయడంతో పాటు చెక్క తలుపుల స్థానంలో డబుల్ డోర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
పక్షులు లోపలికి రాకుండా అమెరికా నుంచి తెప్పించిన విషరహిత జెల్ను వినియోగిస్తున్నారు. అలాగే వేట పక్షుల అరుపులను అనుకరించే ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేసి పావురాలను దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. స్టేడియం పరిసరాల్లో కోతులు, వీధికుక్కల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్తో అధికారులు సమన్వయం చేస్తున్నారు. ఆటగాళ్లకు, ప్రేక్షకులకు ఎలాంటి అంతరాయం లేకుండా పోటీలు సజావుగా నిర్వహించేందుకు ఈ చర్యలు చేపట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!