
బిజినెస్

టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ భారత్ కంటే లండన్లో ఎక్కువగా ఉంటున్నాడన్న వార్తలు ఇటీవల వైరల్గా మారాయి. మ్యాచ్లు ఉన్నప్పుడే భారత్కు వస్తాడన్న చర్చల మధ్య, ప్రస్తుతం అతడు ఐపీఎల్ కోసం బెంగళూరులో ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ టీమ్ మేనేజ్మెంట్ ముందు కొన్ని డిమాండ్లు పెట్టాడని, ముఖ్యంగా బెంగళూరు నుంచి లండన్కు ప్రత్యేక ఛార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని కోరినట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
అయితే ఈ రూమర్స్ను కోహ్లీ ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్టుతో ఖండించాడు. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. ఇదే సమయంలో జట్టు ప్రదర్శనపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఒక మాజీ క్రికెటర్ జట్టు బ్యాటింగ్కు 10లో 10 మార్కులు ఇవ్వగా, బౌలింగ్కు మాత్రం 1 మార్క్ మాత్రమే ఇవ్వవచ్చని వ్యాఖ్యానించడం గమనార్హం.






.jpg&w=3840&q=75)







.webp&w=3840&q=75)
.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!