

హరారే వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డులను తిరగరాసాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ధాటిగా విరుచుకుపడిన ఈ బీహార్ కుర్రాడు, కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి ఫైనల్ను ఏకపక్షంగా మార్చేశాడు. 15 ఫోర్లు, 15 సిక్సర్లతో స్టేడియం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపిస్తూ, వన్డే ఫైనల్కు అసాధారణమైన 218.75 స్ట్రైక్రేట్తో ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ ఇన్నింగ్స్తో వైభవ్ అనేక చారిత్రాత్మక రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. కేవలం 55 బంతుల్లో సెంచరీ సాధించి అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో వేగవంతమైన శతకం చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఉన్ముక్త్ చంద్ పేరిట ఉన్న ఫైనల్ అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా, ఒకే ఇన్నింగ్స్లో 15 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 14 ఏళ్ల వయసులో వరల్డ్కప్ ఫైనల్లో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా గుర్తింపు పొందిన వైభవ్, ఇప్పటికే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, భవిష్యత్ టీమ్ ఇండియా స్టార్గా క్రీడా వర్గాల ప్రశంసలు అందుకుంటున్నాడు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!