

అఫ్గానిస్థాన్తో జరిగిన మూడు టీ20ల సిరీస్లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ఒక్క మ్యాచ్లోనూ అవకాశం దక్కలేదు. జింబాబ్వే పర్యటనలో 151 పరుగులతో సత్తా చాటినప్పటికీ.. సంజు శాంసన్, అభిషేక్ శర్మలతో కూడిన ఓపెనింగ్ కాంబినేషన్కే టీమ్ఇండియా మేనేజ్మెంట్ ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నిర్ణయంపై వివరణ ఇచ్చిన భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్.. వైభవ్ ప్రతిభపై తమకు ఎలాంటి సందేహం లేదని, అయితే జట్టు కోసం కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లకు ముందుగా అవకాశం ఇవ్వడం సహజమని చెప్పాడు.
ఇంగ్లాండ్ సిరీస్లో సంజు శాంసన్ను పక్కన పెట్టి వైభవ్కు అవకాశం కల్పించడం తన కోచింగ్ కెరీర్లో అత్యంత కఠిన నిర్ణయాల్లో ఒకటని గంభీర్ తెలిపాడు. ప్రపంచకప్లో అద్భుతంగా రాణించిన ఆటగాడు కొన్ని మ్యాచ్ల్లో విఫలమైనంత మాత్రాన తన సామర్థ్యాన్ని కోల్పోడని పేర్కొన్నాడు. వైభవ్ విషయంలో తమకు పూర్తి స్పష్టత ఉందని, అతడు తన అవకాశం కోసం వేచి చూడాల్సిందేనని చెప్పాడు. జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాడి కంటే.. కొంతకాలంగా స్థిరంగా రాణిస్తున్న ఆటగాడికే ముందుగా ప్రాధాన్యం ఉంటుందని, వైభవ్కు అవకాశం వచ్చినప్పుడు తగినంత సమయం ఇస్తామని గంభీర్ స్పష్టం చేశాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!