

టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ఇంకా సుమారు 50 రోజుల సమయం ఉండగానే భారత జట్టును ప్రకటించేందుకు సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం జట్టును ఖరారు చేసే అవకాశం ఉంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.
జట్టును ముందుగానే ప్రకటించినప్పటికీ, టోర్నీ మొదలయ్యే వరకు మార్పులు చేసుకునే అవకాశం ఆతిథ్య దేశంగా భారత్కు ఉంది. ఈ నేపథ్యంలో అయిదు లేదా ఆరుగురు ఆటగాళ్లను స్టాండ్బైలుగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కూడా ఇదే విధంగా చివరి నిమిషంలో మార్పులు చేసిన ఉదాహరణ ఉంది.
టీ20 ప్రపంచకప్కు ముందు జనవరిలో స్వదేశంలో న్యూజిలాండ్తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్లకు కూడా జట్లను సెలక్టర్లు ప్రకటించనున్నారు. కివీస్తో టీ20 సిరీస్లో ఆడే జట్టే ప్రపంచకప్కు ప్రధానంగా ఎంపికయ్యే అవకాశముందని అంచనా.
సెలక్టర్లు ప్రకటించబోయే జట్టులో పెద్దగా ఆశ్చర్యపరిచే పేర్లు ఉండకపోవచ్చని సమాచారం. పేలవ ఫామ్ ఉన్నప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ లకు జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రపంచకప్ను సూర్య ఆటగాడిగానూ, కెప్టెన్గానూ చివరి అవకాశంగా భావిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
శుభ్మన్ గిల్ పై విమర్శలు ఉన్నప్పటికీ, అతడికి బదులుగా ఇతరులను ఎంపిక చేసే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ విభాగంలో సూర్య, గిల్తో పాటు అభిషేక్, తిలక్ కొనసాగనున్నారు. జితేశ్ను తొలి ప్రాధాన్య వికెట్ కీపర్గా, సంజు శాంసన్ను రెండో వికెట్ కీపర్గా ఎంపిక చేసే సూచనలు ఉన్నాయి.
ఆల్రౌండర్లుగా హార్దిక్, దూబె, అక్షర్, సుందర్ జట్టులో స్థానం దక్కించుకునే అవకాశముంది. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ కొనసాగనున్నారు. యశస్వి, నితీశ్, పరాగ్, రింకు సింగ్, ప్రసిద్ధ్లను స్టాండ్బై జాబితాలో ఉంచే అవకాశం ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!