

భారత యువ బ్యాటర్ క్రికెటర్ షెఫాలి వర్మ (Shafali Verma) ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉంది. శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ20 ల సిరీస్లో నాలుగు మ్యాచ్ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసింది. మంగళవారం తిరువనంతపురంలో లంకతో జరిగే ఐదో టీ20 లోనూ షెఫాలి ఇదే జోరు కొనసాగిస్తే ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది.
ఈ యువ బ్యాటర్ మరో 75 పరుగులు చేస్తే మహిళల అంతర్జాతీయ టీ20 సిరీస్లో ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్గా నిలవనుంది. లంకతో సిరీస్లో షెఫాలి ఇప్పటివరకు 236 పరుగులు చేసింది. తొలి మ్యాచ్లో కేవలం తొమ్మిది పరుగులకే ఔటైన ఆమె.. తర్వాత వరుసగా మూడు మ్యాచ్ల్లో అర్ధ శతకాలతో (69, 79, 79) చెలరేగింది.
ఓవరాల్గా టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ దిగ్గజం హేలీ మాథ్యూస్ (310) పేరిట ఉంది. శ్రీలంకతో ఐదు టీ20 ల సిరీస్ విషయానికొస్తే.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లోనూ భారత జట్టే విజయం సాధించింది. చివరి మ్యాచ్లోనూ గెలిచి క్లీన్స్వీప్ చేయాలని హర్మన్ప్రీత్ సేన.. పట్టుదలతో ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!