

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ చివరి బెర్తును రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. వాంఖడే స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఉత్కంఠభరిత విజయం సాధించిన రాజస్థాన్, ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు షాక్ ఇచ్చింది. జోఫ్రా ఆర్చర్ అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్ హీరోగా నిలిచాడు. బ్యాట్తో 32 పరుగులు చేసిన అతడు, బంతితో 3 వికెట్లు తీసి ముంబై బ్యాటింగ్ను కుదేలు చేశాడు.
భారీ లక్ష్య ఛేదనలో ముంబై ప్రారంభం నుంచే ఒత్తిడిలో పడింది. ఆర్చర్ తొలి ఓవర్లోనే రోహిత్ శర్మను డకౌట్ చేయగా, నమన్ ధీర్, రికెల్టన్ త్వరగా పెవిలియన్ చేరారు. సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటంతో 60 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. పవర్ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయిన ముంబై చివరకు ఓటమి పాలైంది.
మరోవైపు రాజస్థాన్ బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ విఫలమైనా ధ్రువ్ జురెల్ 38 పరుగులతో నిలబడగా, ఆర్చర్ వేగంగా ఆడి జట్టుకు కీలక స్కోర్ అందించాడు. చివరి ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టిన రాజస్థాన్ 200 పరుగుల మార్క్ దాటింది. ఈ విజయంతో 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టిన రాజస్థాన్, ఎలిమినేటర్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఎదుర్కోనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!