

భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. బెల్ఫాస్ట్ వేదికగా జరగనున్న ఈ తొలి పోరులో గెలిచి సిరీస్లో శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తుండగా, సొంతగడ్డపై భారత్కు షాక్ ఇవ్వాలని ఐర్లాండ్ పట్టుదలగా ఉంది. అయితే, ఈ ఆసక్తికరమైన మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడా? లేదా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
స్థానిక వాతావరణ నివేదికల ప్రకారం బెల్ఫాస్ట్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై, తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే సంభావ్యత 30 నుంచి 43 శాతం వరకు ఉండొచ్చని, ఉష్ణోగ్రతలు 22 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. అయితే, భారీ వర్షం కురిసి మ్యాచ్ పూర్తిగా రద్దయ్యేంత ప్రభావం ఉండకపోవచ్చని తెలుస్తోంది. మధ్యమధ్యలో ఆటకు అంతరాయాలు కలిగినా, ఓవర్లను కుదించి అయినా మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!