

రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు.. దీర్ఘకాలంగా వేధిస్తున్న కాలి గాయం నుంచి కోలుకోవడంపై దృష్టి సారించేందుకు 2025లో మిగిలిన అన్ని BWF టూర్ ఈవెంట్ల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది.
తన వైద్య బృందం, కోచ్తో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని 30 ఏళ్ల సింధు తెలిపింది. పూర్తిగా కోలుకోవడమే తన ప్రధాన లక్ష్యం అని ఆమె నొక్కి చెప్పింది. "గాయాలు మన సహనాన్ని పరీక్షిస్తాయి, కానీ అంతకంటే బలంగా తిరిగి రావాలనే కోరికను కూడా పెంచుతాయి" అని సింధు వ్యాఖ్యానించింది.
డాక్టర్ దిన్షా పర్దివాలా, ఆమె సహాయక బృందం మార్గదర్శకత్వంలో సింధు ఇప్పటికే పునరావాసం, ఫిట్నెస్ శిక్షణను ప్రారంభించింది. ఈ సీజన్లో తరచుగా టోర్నమెంట్ల నుంచి నిష్క్రమించాల్సి వచ్చినప్పటికీ, మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన సింధు ఆత్మవిశ్వాసంతో ఉంది. 2026లో బలంగా తిరిగి రావడానికి ఆమె కృషి చేస్తోంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!