
క్రీడలు

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. ఆటగాళ్లు, సిబ్బంది హనీట్రాప్ వంటి ముప్పులకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్ని జట్లకు సూచనలు జారీ చేసింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారిక నోటీసులు పంపించారు.
జట్టు మేనేజర్ అనుమతి లేకుండా హోటల్ గదుల్లోకి ఇతరులను అనుమతించకూడదని, ప్రతి సందర్శకుడి వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, సస్పెన్షన్, డిస్క్వాలిఫికేషన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవసరమైతే పోలీసు కేసులు కూడా నమోదు అవుతాయని బీసీసీఐ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!