

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 5వ సీజన్ పూర్తి షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం అభిమానుల ఆదరణ పెంచుకుంటూ వస్తున్న ఈ టోర్నీ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి విశాఖపట్నం, కడప, మంగళగిరి వేదికలుగా మొత్తం 32 మ్యాచ్లు నిర్వహించనున్నారు. మూడు వేదికల్లోనూ డే అండ్ నైట్ మ్యాచ్లు జరగనున్నాయి.
జూన్ 9 నుంచి 14 వరకు విశాఖపట్నంలో 11 మ్యాచ్లు, జూన్ 17 నుంచి 21 వరకు కడపలో 9 మ్యాచ్లు, జూన్ 24 నుంచి 30 వరకు మంగళగిరిలో 12 మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఫైనల్ మ్యాచ్ కూడా మంగళగిరిలోనే జరగనుంది. ఆటగాళ్ల ప్రయాణం మరియు విశ్రాంతి కోసం నాలుగు రోజులు కేటాయించారు. ఈసారి అన్ని మ్యాచ్లను జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ACA ప్రకటించింది. రికీ భూయ్, బండారు అయ్యప్ప, త్రిపురణ విజయ్, పైలా అవినాష్, రషీద్ వంటి ఐపీఎల్ మరియు అండర్-19 ఆటగాళ్లు ఈ సీజన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. రాష్ట్రంలోని ఇతర స్టేడియంల అభివృద్ధికి కూడా ACA ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!