
రాజకీయాలు

కైరోలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్లో భారత షూటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో శాంభవీ క్షీరసాగర్, దివ్యాన్షు దేవాంగన్ జోడీ ప్రపంచ రికార్డ్ స్కోరుతో స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో ఈ జోడీ 499.9 పాయింట్లు సాధించి విజేతలుగా నిలిచింది.
చైనీస్ తైపీ జోడీ సాయ్ చీ, చెన్ యు రజత పతకం గెలుచుకోగా, ఫ్రాన్స్ జట్టుకు కాంస్య పతకం దక్కింది. ఈ విజయంతో టోర్నమెంట్లో భారత్ నాలుగో స్వర్ణ పతకాన్ని అందుకుంది. మొత్తం నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్యాలతో 12 పతకాలు సాధించి భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!