

థామస్ కప్లో భారత పురుషుల జట్టు సెమీస్ చేరాలన్న పట్టుదలతో క్వార్టర్ ఫైనల్కు సిద్ధమైంది. ఈ కీలక మ్యాచ్లో బలమైన ప్రత్యర్థి చైనీస్ తైపీతో భారత్ తలపడనుంది. గ్రూప్ దశలో కెనడా, ఆస్ట్రేలియాపై విజయాలు సాధించిన భారత్, చైనా చేతిలో ఓడిపోవడంతో రెండో స్థానంలో నిలిచింది.
ఇక గ్రూప్ సి టాపర్గా నిలిచిన చైనీస్ తైపీ జట్టు అగ్రశ్రేణి ఆటగాళ్లతో బలంగా కనిపిస్తోంది. అయినప్పటికీ భారత జట్టు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో మంచి ఫామ్లో ఉండటం జట్టుకు బలాన్నిస్తోంది. ఆయుష్ శెట్టి మంచి ఫామ్లో ఉండగా, మూడో సింగిల్స్ బాధ్యతలను ప్రణయ్, శ్రీకాంత్ భుజాన వేసుకోనున్నారు. లక్ష్యసేన్ ఇటీవల రెండు మ్యాచ్ల్లో ఓడినా, అతడిని తక్కువగా అంచనా వేయలేమని విశ్లేషకులు అంటున్నారు.
డబుల్స్ విభాగంలో సాత్విక్-చిరాగ్ జంటపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ జోడీ నుంచి భారత్కు కీలక విజయాలు ఆశిస్తోంది. మరోవైపు ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో మలేసియా-చైనా, జపాన్-ఫ్రాన్స్, థాయ్లాండ్-డెన్మార్క్ జట్లు తలపడనున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!