

థామస్ కప్ ఫైనల్స్లో గ్రూప్ దశ చివరి మ్యాచ్లో భారత్ జట్టు చైనా చేతిలో 2-3 తేడాతో ఓటమి చెందింది. ఇప్పటికే గ్రూప్-ఎ నుంచి భారత్, చైనా జట్లు క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించాయి. ఈ విజయంతో చైనా గ్రూప్లో అగ్రస్థానాన్ని దక్కించుకోగా, భారత్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. చైనాతో జరిగిన ఈ పోరులో తొలి సింగిల్స్లో లక్ష్యసేన్ 19-21, 21-8, 12-21తో లి షిఫెంగ్ చేతిలో ఓడిపోయాడు. అనంతరం డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జోడీ 13-21, 21-13, 24-26తో లియాంగ్-వాంగ్ జోడీకి పరాజయం పాలవడంతో భారత్ 0-2తో వెనుకబడింది.
అయితే రెండో సింగిల్స్లో ఆయుష్ 17-21, 21-13, 21-15తో వెంగ్ యాంగ్ను ఓడించి స్కోర్ను 2-1కి తగ్గించాడు. కానీ రెండో డబుల్స్లో అర్జున్-హరిహరన్ జోడీ 17-21, 13-21తో టింగ్-జియాంగ్ చేతిలో ఓడిపోవడంతో చైనా 3-1తో విజయం ఖాయం చేసుకుంది. చివరిగా జరిగిన మూడో సింగిల్స్ మ్యాచ్లో ప్రణయ్ 20-22, 21-19, 21-11తో గ్వాంగ్పై గెలిచినా, మ్యాచ్ ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపలేదు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!