

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. జూన్ 14న బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగే మ్యాచ్తో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఇటీవల ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లపై విజయాలు సాధించడం, మహిళల ప్రీమియర్ లీగ్ ద్వారా ఆటగాళ్లు మరింత మెరుగుపడటం భారత జట్టుకు విశ్వాసాన్ని పెంచాయి.
అయితే గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ వంటి జట్లతో పోటీ ఉండటంతో భారత్కు కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి. స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, షెఫాలీ వర్మ వంటి కీలక ఆటగాళ్లపై జట్టు ఆశలు పెట్టుకుంది. 2020లో రన్నరప్గా నిలిచిన భారత్, ఈసారి తొలి మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!