

ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఐసీసీ 2026 మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయి ప్రైజ్ మనీని ప్రకటించింది. జూన్ 12 నుంచి ఇంగ్లాండ్లో ప్రారంభమయ్యే ఈ టోర్నీలో తొలిసారిగా 12 జట్లు పాల్గొననున్నాయి. మొత్తం 33 మ్యాచ్లు ఏడు వేదికల్లో నిర్వహించనున్నారు. దీంతో ఇది మహిళల టీ20 వరల్డ్కప్ చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్గా నిలవనుంది.
ఐసీసీ వివరాల ప్రకారం విజేత జట్టుకు 2.34 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.22 కోట్లకు పైగా), రన్నరప్ జట్టుకు 1.17 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.11 కోట్లు) అందజేయనున్నారు. సెమీఫైనల్స్కు చేరిన జట్లకు, టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు కూడా ప్రత్యేక నగదు బహుమతులు ప్రకటించారు. గ్రూప్ దశలో ప్రతి విజయానికి అదనపు బోనస్ కూడా ఇవ్వనున్నారు. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!