
రాజకీయాలు

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య తన స్నేహితురాలు మహికా శర్మతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం రాత్రే తిరుమలకు చేరుకున్న వీరిద్దరూ ముందుగా మొక్కు మేరకు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
ఆదివారం ఉదయం హార్దిక్ పాండ్య, మహికా శర్మ సుప్రభాత సేవలో పాల్గొని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితులు హార్దిక్ పాండ్యకు వేదాశీర్వచనం అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు, అభిమానులు ఆయనను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!