

ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ నమోదు అయింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్పై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గతంలో ఫామ్ లేకుండా, “అస్థిర ఆటగాడు” అంటూ విమర్శలు ఎదుర్కొన్న ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు వచ్చిన విషయం తెలిసిందే. చివరి మూడు మ్యాచ్ల్లో 9, 7, 6 పరుగులే చేసిన సంజు, ఈసారి తన ఫామ్ను తిరిగి పొందుతూ విమర్శలకు సమాధానం ఇచ్చాడు. ఢిల్లీపై 56 బంతుల్లో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
చెపాక్ స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. సంజు శాంసన్ అద్భుత సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్కు 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సంజు శాంసన్ (115 నాటౌట్) ఇన్నింగ్స్ మ్యాచ్ మొత్తానికి హైలైట్గా నిలిచింది.


















.jpeg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!