

టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టులోకి తన ఎంపిక కలలా అనిపించిందని టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తెలిపారు. స్పెయిన్లో రియల్ మాడ్రిడ్ ఫుట్బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే జట్టు నుంచి అనూహ్యంగా పిలుపు వచ్చిందని చెప్పారు. గాయపడిన హర్షిత్ రాణా స్థానంలో తనను ఎంపిక చేసినట్లు తెలిపిన సూర్యకుమార్ యాదవ్ ఫోన్ చేసినప్పుడు మొదట నమ్మలేక “జోక్ చేయకండి” అని చెప్పానని సిరాజ్ వెల్లడించాడు.
కొద్దిసేపటికే సెలక్షన్ కమిటీ సభ్యుడు ప్రగ్యాన్ ఓఝా కూడా అదే విషయం చెప్పడంతో తన ఆనందానికి అవధులు లేకపోయాయని సిరాజ్ పేర్కొన్నారు. ఇటీవల టీ20లకు దూరంగా ఉండటంతో ప్రపంచకప్లో చోటు దక్కుతుందని అసలు ఊహించలేదని, ముంబైకి ప్రయాణించే సమయంలో కూడా ఇది కలలా అనిపించిందని చెప్పారు. దేవుడు ఏది రాసిపెడితే అదే జరుగుతుందని వ్యాఖ్యానిస్తూ జట్టుకు ఎంపిక కావడం తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!