
టెక్నాలజీ

సీనియర్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కు దిల్లీ హైకోర్టు ఊరటనిచ్చింది. ఆసియా క్రీడల ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు ఆమెకు అనుమతి ఇస్తూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వినేశ్ లాంటి ప్రతిభావంతమైన అథ్లెట్ను పోటీలకు దూరంగా ఉంచడం సరైంది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మహిళా అథ్లెట్లను మాతృత్వం కారణంగా పోటీల నుంచి తప్పించడం అన్యాయమని కోర్టు స్పష్టం చేసింది.
ఈ నెల 30, 31 తేదీల్లో జరగనున్న ఆసియా క్రీడల ఎంపిక పోటీల దృశ్యాలను పూర్తిగా రికార్డ్ చేయాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. అలాగే భారత క్రీడా ప్రాధికార సంస్థ మరియు భారత ఒలింపిక్ సంఘం నుంచి పరిశీలకులు హాజరు కావాలని తెలిపింది. ఎంపిక నిబంధనలను చివరి నిమిషంలో మార్చిన తీరుపై వినేశ్ ఫొగాట్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!