

దేశానికి అనేక దిగ్గజ క్రికెటర్లను అందించిన ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ పోటీల్లో తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లకు కేంద్ర స్థాయి ఒప్పందాల తరహాలో వార్షిక ఒప్పందాలను అందించేందుకు సిద్ధమైంది. ఆటగాళ్ల ప్రదర్శన, ఫిట్నెస్ మరియు ఇతర ప్రమాణాలను ఆధారంగా తీసుకుని వారిని మూడు విభాగాలుగా విభజించి ఒప్పందాలు కేటాయించనుంది.
మొదటి విభాగంలోని ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు, రెండో విభాగంలోని వారికి రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు, మూడో విభాగంలోని వారికి రూ.8 లక్షల పారితోషికం అందించనుంది. ఈ విధానాన్ని 2026-27 దేశవాళీ సీజన్ నుంచి అమలు చేయనున్నారు. అయితే ఈ ఒప్పందాలు మహిళా జట్టుకు కూడా వర్తిస్తాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. దేశవాళీ స్థాయిలో ఆటగాళ్లకు ఇలాంటి ఒప్పందాలను అందించే తొలి రాష్ట్ర సంఘంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ నిలవనుంది.


.webp&w=3840&q=75)
.jpg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!