

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ గంభీర్కు మద్దతుగా ట్వీట్ చేసిన తరువాత, గంభీర్ స్పందించారు. “డాక్టర్ శశి థరూర్, మీకు చాలా ధన్యవాదాలు. ఈ దుమారం సద్దుమణిగాక, కోచ్కి ఉండే ‘అపరిమిత అధికారం’ వెనుక ఉన్న నిజానిజాలు, లాజిక్ లు స్పష్టమవుతాయి. అప్పటివరకు, నా అత్యుత్తమమైన సొంత వాళ్లతోనే నన్ను పోల్చి చూడటం నాకు వినోదంగా ఉంది” అని గంభీర్ పేర్కొన్నారు.
న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా ఓటమి పాలైందని తెలిసిందే. ఈ ఓటమి తర్వాత గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన వైఖరి పై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, శశి థరూర్ గంభీర్కు మద్దతుగా మాట్లాడడం విశేషం. “నాగ్పూర్లో నా పాత మిత్రుడు గౌతమ్ గంభీర్తో మాట్లాడాను. ప్రధానమంత్రి తర్వాత భారతదేశంలో అత్యంత కష్టమైన ఉద్యోగం ఆయనదే. రోజూ లక్షలాది మంది విమర్శిస్తున్నా, ప్రశాంతంగా, ధైర్యంగా ముందుకు సాగుతున్నారు” అని థరూర్ ప్రశంసించారు.
తాజాగా ఈ ట్వీట్ పైనే గంభీర్ స్పందించాడు. కోచ్ తన నిర్ణయాలు, విధానాలపై విమర్శలుంటే కూడా తన సామర్థ్యం, అనుభవాన్ని గౌరవంతో చూపిస్తారని, అభిమానుల మద్దతు కూడా అతడికి ప్రేరణ అని గంభీర్ తెలిపాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ ఇందులో తాము కూడా గంభీర్ పట్ల మద్దతు వ్యక్తం చేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!