
సినిమాలు

టీ20 ప్రపంచకప్లో జరిగిన కీలక మ్యాచ్కు సంబంధించి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు క్షమాపణలు చెప్పారు. సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అక్షర్ను జట్టులోకి తీసుకోకపోవడం తప్పు నిర్ణయమని సూర్య అంగీకరించాడు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయం జట్టుకు సరైనది కాలేదని వెల్లడించాడు.
అక్షర్ను జట్టులోకి తీసుకోకపోవడంతో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడని సూర్య తెలిపారు. మ్యాచ్ తర్వాత అతనితో మాట్లాడటం కూడా తనకు కష్టంగా అనిపించిందని చెప్పారు. ఆ మ్యాచ్లో అక్షర్కు బదులుగా వాషింగ్టన్ సుందర్ను తీసుకున్నారు. అయితే ఆ మ్యాచ్లో భారత్ ఘోరంగా ఓడిపోవడంతో కెప్టెన్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.



















.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!