
రివ్యూలు

బీహార్ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీలో బ్యాటర్ అక్షర గుప్తా చరిత్ర సృష్టించింది. భాగల్పూర్లోని సండిస్ కాంపౌండ్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్లో ఆమె అజేయంగా 306 పరుగులు చేసి మహిళల దేశీయ క్రికెట్లో అరుదైన రికార్డు నమోదు చేసింది.
కేవలం 126 బంతుల్లో 306 పరుగులు చేసిన అక్షర గుప్తా ఇన్నింగ్స్లో 55 ఫోర్లు, 8 సిక్సర్లు బాదింది. 242.86 స్ట్రైక్రేట్తో 233 నిమిషాలు క్రీజులో నిలిచింది. 16 బంతుల్లో అర్ధశతకం, 34 బంతుల్లో శతకం పూర్తి చేసిన ఆమె ట్రిపుల్ సెంచరీతో సంచలనం సృష్టించింది. ఈ ఇన్నింగ్స్పై బీసీఏ అధికారులు ప్రశంసలు కురిపించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!