

తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న రియాలిటీ షో ‘బిగ్బాస్’ మరో సీజన్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బిగ్బాస్ తెలుగు సీజన్ 10 ఈ నెల 6న గ్రాండ్గా ప్రారంభం కానుండగా, టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్గా వ్యవహరించనున్నారు. ఈసారి ‘ఆటలో సవాల్ కాదు...ఆటే సవాల్’ అనే కొత్త కాన్సెప్ట్తో షోను రూపొందించినట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష 2’ నిర్వహిస్తున్నారు. తొలుత 15 మంది పోటీదారులు పాల్గొనగా, గాయత్రి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం 14 మంది రేసులో ఉన్నారు. వీరిలో ప్రతిభ చూపిన 5 లేదా 6 మందికి మాత్రమే బిగ్బాస్ మెయిన్ హౌస్లోకి ప్రవేశం లభించనుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, అగ్నిపరీక్షలో తన మాటతీరు, టాస్క్లు ఆడే విధానంతో ఆకట్టుకున్న ఝాన్సీకి మెయిన్ హౌస్లో డైరెక్ట్ ఎంట్రీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిజికల్, మైండ్ గేమ్లలో మెప్పిస్తున్న రోహిత్ నాయుడు ఎంట్రీ కూడా దాదాపు ఖరారైనట్లు సమాచారం. మిగిలిన స్థానాల కోసం చరణ్, మిథిలేష్, రాజకుమారి, అమన్ మసూద్, షాలినీ, అపూర్వ, రామకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. గత సీజన్లలో పల్లవి ప్రశాంత్, కళ్యాణ్ పడాల వంటి కామనర్స్ టైటిల్స్ సాధించి సంచలనం సృష్టించిన నేపథ్యంలో, ఈసారి కూడా కామనర్స్, సెలబ్రిటీల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!