

Bigg Boss Telugu తొమ్మిదవ సీజన్ 105 రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగి ఆదివారంతో ముగిసింది. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది డిమోన్ పవన్ రూ.15 లక్షల నగదు ఆఫర్ను స్వీకరించి హౌస్ నుంచి బయటకు రావడం.
ఫినాలే కార్యక్రమానికి రవితేజ, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హాజరై సందడి చేశారు. ప్రత్యేక టాస్క్లో భాగంగా రవితేజ సిల్వర్ బ్రీఫ్ కేస్తో హౌస్లోకి వెళ్లి కల్యాణ్, తనూజ, డిమోన్ పవన్ లతో మాట్లాడారు.
మొదట రూ.5 లక్షలతో ప్రారంభమైన ఆఫర్ను క్రమంగా రూ.15 లక్షల వరకు పెంచారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న డిమోన్ పవన్ నగదు తీసుకుని పోటీలో నుంచి నిష్క్రమించారు. దీంతో ఈ సీజన్ విజేతకు రూ.35 లక్షల ప్రైజ్ మనీ మాత్రమే ఉంటుందని హోస్ట్ నాగార్జున వెల్లడించారు. ప్రేక్షకుల ఓట్లలో పవన్ మూడో స్థానంలో నిలవడం కూడా అతడికి మరింత ఆనందాన్ని ఇచ్చింది.
టాప్–5లో ముందుగా సంజన గల్రానీ అత్యల్ప ఓట్లతో ఎలిమినేట్ కాగా, ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ బయటకు వచ్చారు. ఎలిమినేషన్ అనంతరం ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ, బిగ్బాస్ తనకు మానవ విలువలు, కుటుంబ ప్రాముఖ్యతను నేర్పిందని భావోద్వేగంగా చెప్పారు.
సంజన మాట్లాడుతూ, యువతతో పోటీపడి టాప్–5 వరకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. గత తొమ్మిది సీజన్లలో మహిళా విజేత లేరని గుర్తుచేస్తూ, ఈసారి తనూజ గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
గ్రాండ్ ఫినాలేలో రోషన్, అనస్వర రాజన్, శ్రీకాంత్, నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి తదితరులు పాల్గొని వేడుకకు మరింత వైభవం తీసుకొచ్చారు.

_1771477764226.jpg&w=3840&q=75)










.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!