

బిగ్బాస్ తెలుగు 10లో రోహిత్, త్రిగుణ్ మధ్య కొనసాగుతున్న పోటీ మరోసారి హైలైట్ అయింది. హౌస్లోకి వచ్చినప్పటి నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. గత మూడు రోజులుగా కూడా రోహిత్ను త్రిగుణ్ టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపించడంతో వీరి మధ్య గొడవలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా హౌస్మేట్గా మారేందుకు జరిగిన తొలి టాస్క్లో కూడా ఇదే పోటీ కొనసాగింది.
ఈ టాస్క్లో రెడ్ టీమ్ నుంచి రోహిత్, వంశీ.. బ్లూ టీమ్ నుంచి త్రిగుణ్, ముఖేష్ పాల్గొన్నారు. త్రిగుణ్, ముఖేష్ ముందుగా టాస్క్ పూర్తి చేసి బెల్ కొట్టడంతో బిగ్బాస్ వారిని విజేతలుగా ప్రకటించాడు. అయితే రోహిత్ తన ఓటమిని అంగీకరించకుండా టాస్క్లో నిబంధనలు పాటించలేదని, పైగా పేర్చిన పేరు కూడా తప్పుగా ఉందని బిగ్బాస్ను ప్రశ్నించాడు. దీంతో టాస్క్ను మరోసారి పరిశీలించిన తర్వాత రోహిత్, వంశీలను విజేతలుగా ప్రకటించారు. దీంతో ముందుగా సంబరాలు చేసుకున్న బ్లూ టీమ్ ఒక్కసారిగా సైలెంట్ అయింది. రోహిత్ గెలుపుతో త్రిగుణ్తో అతని పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!