

బిగ్బాస్ తెలుగు సీజన్ 10 మూడో రోజు ఎపిసోడ్లో హౌస్లో హీట్ మరింత పెరిగింది. టాస్క్లో రెండు టీమ్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వకపోవడంతో బిగ్బాస్ ఒక్కో టీమ్ నుంచి ఒకరిని హైరిస్క్ జోన్లో ఉంచాలని ఆదేశించారు. బ్లూ టీమ్ నుంచి రాంప్రసాద్ స్వయంగా హైరిస్క్లోకి వెళ్లేందుకు ముందుకు రాగా, రెడ్ టీమ్లో చరణ్, షాలినిలలో చరణ్ను గ్రూప్ నిర్ణయంతో ఎంపిక చేశారు.
హైరిస్క్లో ఉన్న రాంప్రసాద్, చరణ్ తమ తమ టీమ్లలో ఉండే హక్కును కోల్పోయారని బిగ్బాస్ ప్రకటించారు. దీంతో బ్లూ టీమ్కు కొత్త కెప్టెన్ను ఎంపిక చేయాల్సి వచ్చింది. తొలుత ముఖేశ్, త్రిగుణ్ పేర్లు వినిపించినా.. రాంప్రసాద్ సూచనతో చివరకు దేబ్జానీ బ్లూ టీమ్ కెప్టెన్గా ఎంపికైంది. మరోవైపు బ్యాడ్జ్ల టాస్క్లో దేబ్జానీ ముఖేశ్కు ‘చార్మింగ్’ బ్యాడ్జ్ ఇవ్వడం కూడా ఆసక్తికరంగా మారింది.
ఇంటి పనుల విభజన సమయంలో అసలు వివాదం మొదలైంది. బ్లూ టీమ్ ఇంటి పనులు చేయాలని, రెడ్ టీమ్ వాటిని మానిటర్ చేయాలని దేబ్జానీ ప్రతిపాదించగా, రోహిత్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. తమ టీమ్కు కూడా పనులు చేసే అవకాశం ఇవ్వాలని కోరాడు. రోహిత్ మాట్లాడిన తీరుపై వర్ష, త్రిగుణ్, కృష్ణ స్పందించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
ఇంటి పనుల సమయంలో రోహిత్, సుధీర్ మధ్య కూడా వివాదం చోటుచేసుకుంది. తనకు సంబంధించిన పనిని తానే చేసుకోవాలని, తన పని సుధీర్ ఎందుకు చేశాడని రోహిత్ ప్రశ్నించాడు. ఈ సమయంలో త్రిగుణ్ జోక్యం చేసుకోవడంతో రోహిత్ అతడిని ప్రశ్నించాడు. తనకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మరోవైపు చరణ్ అందరితో కలిసిమెలిసి ఉండాలని దేబ్జానీ సూచించగా, రోహిత్ చరణ్కు మద్దతుగా నిలవడంతో దేబ్జానీ, రోహిత్ మధ్య కూడా వాగ్వాదం జరిగింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!