
జనరల్

మాజీ ఎంపీ కేశినేని నాని సామాజిక మాధ్యమ వేదికగా ఎంపీ కేశినేని చిన్నిపై మరోసారి విమర్శలు గుప్పించారు. పార్టీ అంతర్గత సర్వేలో 3 లక్షల మందిని సంప్రదించగా, వారిలో దాదాపు 2.40 లక్షల మంది అంటే 80 శాతం మంది చిన్నిని తిరస్కరించారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీ కార్యకర్తలతో మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ తన స్థాయిని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
వత్సవాయి, వీరులపాడు మండలాల్లో ఇటీవల నిర్వహించిన సమావేశాలను ప్రస్తావించిన నాని, ఇలాంటి ప్రయత్నాలతో ప్రజాభిప్రాయం మారదని వ్యాఖ్యానించారు. చిన్నిపై తీవ్ర రాజకీయ విమర్శలు చేసిన ఆయన, ప్రజలు ఆయన మాటలను నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!