

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై గత కొన్ని రోజులుగా కుమ్మేసిన అనుమానాలకు చివరికి తెరపడింది. అడియాలా జైల్లో ఆయనను ప్రత్యక్షంగా కలిసిన సోదరి ఉజ్మా ఖానుమ్ ఆయన పూర్తిగా సురక్షితంగా ఉన్నారని వెల్లడించడంతో అభిమానుల్లో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, జైల్లో ఇమ్రాన్పై మానసిక వేధింపులు జరుగుతున్నాయన్న ఆరోపణలు మాత్రం మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతించాలంటూ ఇస్లామాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ నిరసనలు కొనసాగుతుండగా, చివరకు జైలు అధికారులు ఉజ్మా మరియు ఒక లాయర్కు మంగళవారం కలిసేందుకు అనుమతించారు.
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం పై పుకార్లు గత వారం మరింత వేగంగా వ్యాపించాయి. ఆయన ముగ్గురు చెల్లెళ్లు - నురీన్ నియాజి, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ - జైలు వద్ద తమపై దాడి జరిగిందన్న ఆరోపణలు, కుమారులు వ్యక్తపరిచిన ఆందోళనలు గందరగోళాన్ని మరింత పెంచాయి. జైలు అధికారులు ఏదో దాచుతున్నారన్న విమర్శలతో పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఉజ్మా తెలిపిన “ఇమ్రాన్ సేఫ్” అనే నమ్మకంతో పుకార్లు తగ్గినా, ఆయన ఆరోగ్యం, జైలులో జరుగుతున్న వ్యవహారాలపై సందేహాలు మాత్రం ఇంకా తొలగలేదు.




















కామెంట్స్ (1)
ఉజ్మా ఖానుమ్ ఇచ్చిన భరోసాతో అభిమానులు కొంతైనా ఊపిరి పీల్చుకున్నా