
టెక్నాలజీ

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో వరంగల్ రాజకీయాల్లో ప్రస్తుతం నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొండా అనుచరులు ఎలాంటి చర్యలు ఎదురవుతాయోనన్న ఆందోళనతో సైలెంట్గా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల్లో ఉన్న ఆమె అనుచరుల్లో తమ పదవులు కొనసాగుతాయా లేదా అనే టెన్షన్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో కొండా అనుచరులకు కేటాయించిన ఏజెన్సీలపైనా అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు కొండా సురేఖ పదవి తొలగింపుతో వేడుకలకు సిద్ధమైన కొందరు కాంగ్రెస్ నేతలు.. గుండు సుధారాణికి చైర్మన్ పదవి కేటాయించడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే గుండు సుధారాణికి పదవి ఇవ్వడంపై కాంగ్రెస్లోని కొందరు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!